V1News Telangana

best news portal development company in india

పోలీసుల ఉల్లాసానికి క్రీడల స్ఫూర్తి!

SHARE:

నిజామాబాద్‌లో పోలీస్ క్రికెట్ టోర్నీ ప్రారంభం…
మానసిక శాంతికి క్రీడలే మార్గం: కమిషనర్ సాయి చైతన్య…
పోలీసుల మధ్య క్రికెట్ టోర్నీకి ఘన ఆరంభం…
ఉద్యోగ ఒత్తిడిలో విశ్రాంతి ఇచ్చే క్రీడలు – పోలీస్ కమిషనర్…

 

నిజామాబాద్, జూన్ 22:

పోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్., అన్నారు. ఆయన ఆదివారం నిజామాబాద్ నగరంలోని పోలీస్ మైదానంలో ప్రారంభమైన పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు.
కమీషనర్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో నిజామాబాద్ సబ్ డివిజన్, ఆర్మూర్, బోధన్ డివిజన్లు, ఆర్మ్డ్ రిజర్వ్, హోం గార్డ్స్, అలైడ్ బ్రాంచులు తదితర విభాగాల పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“పోలీసులు నిరంతరం ప్రజల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి సందర్భాల్లో క్రీడలు మానసిక విశ్రాంతి కలిగిస్తూ, ఉత్సాహాన్ని పంచుతాయి. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకొని తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలి,” అని సూచించారు.

కమిషనర్ గారి ప్రారంభోత్సవంతో మొదలైన ఈ రెండు రోజుల టోర్నీలో, సిబ్బందిలోని క్రీడాప్రతిభను వెలికి తీయడం లక్ష్యంగా ఉంచారు. ప్రతి పోలీస్ అధికారిని ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారానికి ముందుండాలని సూచిస్తూ, కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ బస్వా రెడ్డి, ఏఆర్ అదనపు కమిషనర్ రామ్ చందర్ రావు, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, పి. శ్రీనివాస్, జె. వెంకటేశ్వర్ రెడ్డి, అలాగే వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india