V1News Telangana

ఎస్బీఐ యూనియన్ సేవా కార్యక్రమం – అనాథ విద్యార్థులకు దుస్తుల పంపిణీ…

బోధన్, జూన్ 20:రాష్ట్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా, రాకాసిపేట్ బ్రాంచ్ యూనియన్ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, అనాథ విద్యార్థులకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు.

యూనియన్ సెక్రటరీ నాగరాజు, అసిస్టెంట్ సెక్రటరీ రాధికతో పాటు సభ్యులు నన్నపునేని లాలయ్య, సుధాకర్, తౌర్యా, ఆనంద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవ్యశ్రీ, మాహిన్ బేగం, మధుప్రియ, నాగలక్ష్మి, ఆదిత్య అనే విద్యార్థులకు ఒక జత చొప్పున దుస్తులు అందించారు.

ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బాలచంద్రం, ఉపాధ్యాయులు శ్రీ కృష్ణ, నగేష్ బాబు, సంజీవ్ కుమార్, సుధాకర్ రెడ్డి, ఖైరాన్, రాకేష్, జ్యోతి, వనిత పాల్గొన్నారు.
విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు చిరకాలం నిలిచేలా చేసిన ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?