– తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
– ప్రభుత్వ బడులలో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, దుస్తులు అన్ని ఉచితంగా అందిస్తారు
– ప్రభుత్వం విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది
– నసురుల్లాబాద్ ఎంపీడీవో సూర్యకాంత్
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం రోజు ఎంపీడీవో సూర్యకాంత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు నూతన విద్యాసంవత్సరానికి గాను పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాం లు , మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందిస్తారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఫీజుల దోపిడీ జరుగుతుందని.. విద్యను వ్యాపారంగా చేస్తూ పేద,మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఐ కె పి ఎపియం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..