బోధన్, జూన్ 11:
వర్షాకాలం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి బోధన్ మండలంలో బీజేపీ నాయకులు గట్టి వేడుకలతో శ్రీకారం చుట్టారు. పెగడపల్లి, కల్దుర్కి రేషన్ షాపుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మోదీ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారి సేవలను సైతం ప్రస్తావిస్తూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
బీజేపీ బోధన్ మండల రూరల్ అధ్యక్షులు సిర్ప సుదర్శన్ మాట్లాడుతూ, “భారత చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఎప్పుడూ లేదు. వర్షాకాలంలో పేదల ఆహార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వడం చారిత్రక ఘట్టం,” అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, “కేంద్రం 5 కిలోలు ఉచితం ఇస్తే, రాష్ట్రం మాత్రం కేవలం 1 కిలో మాత్రమే ఇస్తోంది. ఇది ప్రజలను మభ్యపెట్టే తంతు,” అని ఆరోపించారు.
అలాగే, రైతులకు ఇవ్వాల్సిన భరోసా నిధులు, ధాన్య బోనస్లు, ఋణ మాఫీలు అన్నీ హామీగా మిగిలిపోయాయని విమర్శించారు. “ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరుతో కేవలం తమ పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తున్నారు. రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను మోసం చేస్తున్నారు,” అని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మారెడ్డి, వెంకటేష్, సాయిలు, రాజురె మనోహర్, జిలకర ప్రవీణ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలంలోని వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....