బోధన్, నిజామాబాద్ జిల్లా:
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో బోధన్ ఎంవీఐ శ్రీనివాస్ బస్సు యజమానులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
బోధన్ రవాణా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “185వ రూల్ ప్రకారం అవసరమైన పత్రాలు – RC, ఇన్సూరెన్స్, పర్మిట్, ప్యూషన్, డ్రైవర్ లైసెన్స్ మొదలైనవి – సమర్పించి బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలి” అని వివరించారు.
కమర్షియల్ వాహనాలుగా స్కూల్ బస్సులు నమోదు అయి ఉండే కారణంగా, కమర్షియల్ టాక్స్ పూర్తిగా చెల్లించి ఉండాలి, లేకపోతే బస్సు పట్ల అనుమతిని రద్దు చేసే స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
“పిల్లల భద్రత కోసం ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించదు, విధివిధానాలకు లోబడి ఉండక తప్పదు” అని హెచ్చరించిన ఎంవీఐ శ్రీనివాస్, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....