టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మైనారిటీ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మైనార్టీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, తమను మంత్రివర్గంలోకి తీసుకోవడంలో చూపిన నిర్లక్ష్యం అసహనానికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
“మేము మాత్రమే కాదు – స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే మైనార్టీలకు న్యాయం జరగలేదని ఒప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు మతపరమైన హామీలు ఇవ్వడం, అనంతరం మాటల మాయ చేసి మైనారిటీ వర్గాలను విస్మరించడం కాంగ్రెస్కు అలవాటే. మేము ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం కూడా ఇదే,” అని నాయకులు అన్నారు.
అలాగే వారు ప్రశ్నించారు: “ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అయినా ఇవ్వలేని కాంగ్రెస్, మతపరమైన అభివృద్ధిని ఎక్కడ చేస్తుంది? గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు విద్య, ఉపాధి, వసతి వంటి అనేక రంగాల్లో పథకాల ద్వారా న్యాయం చేసింది.”
“కాంగ్రెస్ నాయకత్వం మాటలతో కాదు – చర్యలతో మైనారిటీలకు న్యాయం చేయాలి. లేకపోతే మేం ఎందుకు మద్దతు ఇవ్వాలి?” అంటూ మైనారిటీ నేతలు గట్టిగా ప్రశ్నించారు.
తమ డిమాండ్ స్పష్టమని, న్యాయం జరగకపోతే పోరాటం ముదిరిస్తామని హెచ్చరించారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....