బోధన్, నిజామాబాద్ జిల్లా:
బోధన్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టౌన్ ప్రెసిడెంట్ గోపి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల MSR బార్ యాజమాన్యం ఒక సీనియర్ రిపోర్టర్పై దాడికి పాల్పడిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఒకవైపు రాత్రి 12 గంటల వరకు అక్రమంగా మద్యం అమ్మకం జరుగుతోంది. మరోవైపు, ఈ అక్రమాలకు అడ్డుగా నిలిచిన రిపోర్టర్ను కొడుతున్నారు. ఇది క్షమించదగిన విషయం కాదు. ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు చుస్తూ కూడా నోరెత్తడం లేదు. వాళ్లకు బార్ యాజమాన్యం ముట్టా వేసిందా?” అంటూ గోపి ప్రశ్నించారు.
MSR బార్ యాజమాన్యం సిబందిపై వెంటనే కేసు నమోదు చేయాలని, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛపై దాడిని బీజేపీ సహించదని హెచ్చరించారు. అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తున్నదని, ఇది బార్ దందాలకు పాలకుల మద్దతునే సూచిస్తున్నదన్నారు

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533