బోధన్, నిజామాబాద్ జిల్లా:వక్ఫ్ భూములపై ప్రభుత్వ హస్తక్షేపానికి వ్యతిరేకంగా బోధన్లో ముస్లిం సోదరులు శాంతియుతంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం – 2025కు వ్యతిరేకంగా, అంబేద్కర్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు.జాతీయ జెండాలను చేతబట్టి, “వక్ఫ్ మా హక్కు – హస్తక్షేపం అన్యాయం!”, “మత సంస్థల ఆస్తులు మాకే!” అనే నినాదాలతో చుట్టుపక్కల మారుమోగించారు.ఈ ఉద్యమానికి మజ్లిస్ ఉలామా-వా-ఖైదీన్ బోధన్, మజిలీస్ మెంజర్ సంస్థలు నేతృత్వం వహించగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడింది.ప్రతిబంధకాలకు లోనుకాకుండా, చట్టబద్ధంగా, గౌరవప్రదంగా సాగిన ఈ ర్యాలీలో పాల్గొన్న ముస్లిం నేతలు మాట్లాడుతూ –“ఈ చట్టం ముస్లింల ఆధ్యాత్మిక, సామాజిక హక్కులపై కుటిల దాడి.ఇది చట్టం కాదు – చిత్తు! మేము ఊరుకోం!” అని హెచ్చరించారు.బోధన్ గడ్డపై నిశ్శబ్ద గళం – శక్తివంతమైన సంకేతం!ఈ శాంతియుత పోరాటం వక్ఫ్ చట్ట సవరణపై ఆపసోపాలు తప్పవని, ముస్లింల ఆస్తుల రక్షణకు దేశ వ్యాప్తంగా మరింత గళమెత్తనుందనే సంకేతంగా నిలిచింది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....