V1News Telangana

నిజాం పాలన కదిలించిన గర్జన – కొమరం భీమ్”.. “జల్-జంగల్-జమీన్ కోసం జ్వాలగా గుదురు – కొమరం భీమ్”…. “నిజాం చేతికి గాయాలే కాదు.. గుండెల్లో గుబులు – భీమ్ ధైర్యం!”… “కొమరం భీమ్ అంటేనే తిరుగుబాటు గాత్రం!”…. “అడవిలోనుంచి ఎగసిన సింహగర్జన.. కొమరం భీమ్ పోరాటం”….

నిజాం పాలనకి గుండెగుబులు తెచ్చిన పోరాట యోధుడు కొమరం భీమ్ జ్ఞాపకార్థంగా విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ముధోల్ నియోజకవర్గంలోని లోకేశ్వర మండల కేంద్రంలో ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి దానసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు.”

ఈ సందర్భంగా మాట్లాడిన పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ –
“కొమరం భీమ్ అంటే ఉద్యమం, తిరుగుబాటు, ఆదివాసీ ఆత్మగౌరవ గర్జన. నిజాం సర్కార్ రాక్షస పాలనను అతలాకుతలం చేసిన ధైర్యశాలి. ‘జల్-జంగల్-జమీన్ మాదే’ అంటూ విప్లవ నినాదంతో గిరిజనుల హక్కుల కోసం ఆయుధం ఎత్తిన యోధుడు.”

భూమి, అడవి, నీరు కోసం సాగిన ఈ పోరాటం కేవలం ప్రత్యక్ష యుద్ధమే కాదు – అది ఆదివాసీ గొంతుక. అన్యాయానికి ఎదురు నిలబడే స్పూర్తి. కొమరం భీమ్ విగ్రహం కేవలం శిల్పం కాదు – అది శక్తిని, స్వాభిమానాన్ని, శౌర్యాన్ని తెలిపే చిహ్నమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post