బోధన్, మంగళవారం:
బోధన్ పట్టణంలోని 18వ వార్డు, అంబేద్కర్ కాలనీలో “జై బాపు, జై భీం, జై సంవిధాన్” కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్ మాట్లాడుతూ, “ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే” అని స్పష్టం చేశారు. పౌరహక్కుల పరిరక్షణకు, సామాజిక సమానత్వానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ హరికాంత్ చారి, వార్డు ఇంచార్జ్ ప్రమోద్ చిన్నతో పాటు స్థానిక నాయకులు దాము, రాములు, మహేష్, లక్ష్మణ్, సంజు, సాయిబాబా, సాయిరెడ్డి, ఖలిం తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








