హున్సా గ్రామంలో 5 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డును ప్రారంభించిన నేతలు
నిజామాబాద్ జిల్లా, సాలూరు మండలంలోని హున్సా గ్రామంలో గ్రామస్తులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు గ్రావెల్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎనర్జీ ఎస్ సంస్థ ద్వారా రూ. 5 లక్షల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు హున్సా గ్రామంలో రోడ్డు అభివృద్ధి కోసం రూ. 20 లక్షల వరకు కేటాయించడం జరిగింది.
ఈ సందర్భంగా హున్సా గ్రామ రైతుల తరపున బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AE లిఖిత మేడం, ఎక్స్ సర్పంచ్ చీల గంగారాం, ఎక్స్ సర్పంచ్ చీల మాధవ్, PACS చైర్మన్ రవి మందర్న, సొసైటీ వైస్ చైర్మన్ వినోద్ బాబా, బాదే గంగారాం (ఎక్స్ ఎన్పీటీసీ), గ్రామ అధ్యక్షులు సమ్మె శంకర్ పటేల్, ఈరప్ప మహారాజ్, నరేందర్, సిద్దన్న, ముర్గె మాధవరావు, చెప్రే హనుమంతరావు తదితర గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

స్థానిక రైతులు, గ్రామ ప్రజలు ఈ అభివృద్ధి పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని మౌలిక సదుపాయాలను గ్రామంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








