Post Views: 231
బోధన్ మండలం, జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ హైమద్ హుస్సేన్ (బాబు) గత ఐదేళ్లుగా రంజాన్ నెలలో నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు సహాయం చేస్తూ వస్తున్నారు.ఈ సంవత్సరం కూడా, ఆయన తన సేవా కార్యక్రమంలో భాగంగా 50 నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, అలాగే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఆయన తల్లి శ్రీమతి జాను బేగం గారి చేతుల మీదుగా ఆదివారం నాడు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మైనార్టీ పెద్దలు షేక్ మజర్ అలీ, రాజ్ మియా, కరామత్, అత్తర్, షేర్ ఖాన్, హుసేన్ ఖాన్, సుభాని, లాల్ హైమద్, అసలం, మౌలానా అబ్దుల్ గని, పాష, బాబు ఖాన్, ఇమ్రాన్, హైమత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్థులు, ముస్లిం సోదరులు ఈ సేవా కార్యక్రమానికి హర్షం వ్యక్తం చేస్తూ, షేక్ హైమద్ హుస్సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు .
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








