V1News Telangana

కేంద్ర ప్రభుత్వం (మోడీ సర్కార్) రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని,

కేంద్ర ప్రభుత్వం (మోడీ సర్కార్) రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిజామాబాదులో మార్చి 11వ తేదీన జరిగే రైతు ధర్నాలు జయప్రదం చేయాలని రైతులకు పిలుపు. సంయుక్త కిసాన్ మోర్చా..SKM జిల్లా ఇంచార్జ్ V. ప్రభాకర్ పిలుపు..

……….. ………. ………….

సంయుక్త కిసాన్ మోర్చా నిజాంబాద్ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్. అడికే. రాజేశ్వర్. అధ్యక్షతన 8 మార్చ్ కోట గల్లీలో సమావేశం జరిగింది.. సమావేశంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. SKM. జిల్లా ఇంచార్జ్..V. ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి రాకముందు బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో మేము అధికారంలోకి వస్తే రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తానని స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని పేర్కొన్నారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులని గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు సీఈఓ గా మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు. రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు దార దత్తం చేయడానికి రైతు వ్యతిరేక మూడు చట్టాలను తీసుకురావడంతో రైతాంగం రాజకీయాలకతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని దీర్ఘకాలికంగా పోరాటం చేయడంతో రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి మోడీ రాతపూర్వకంగా స్వామినాథన్.కమిషన్ సిఫారసుల మేరకు ఎం ఎస్ పి గ్యారెంటీ చట్టాన్ని చేస్తానని .. ఉద్యమంలో అమరత్వం పొందిన వందలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసే ఆదుకుంటానని.. రైతులపై పెట్టిన కేసులు అన్నిటిని రద్దు చేస్తానని హామీ ఇచ్చి మూడోసారి ముచ్చటగా అధికారులకు వచ్చిన తర్వాత సైతం మోసం చేశారని ఎద్దేవా చేశారు..

రద్దు చేస్తానన్న రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల మూడు చట్టాలను మరో రూపమే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తయారు చేయడానికి ముసాయిదాల్ని ముందుకు తెచ్చారు అని అన్నారు.. ఈ ముసాయిదాన్ని రద్దు చేయాలని రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని దేశవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఆందోళనకు ఎస్కేయం పిలుపునిచ్చింది..

ఈ నేపథ్యంలో నిజాంబాద్ జిల్లా కేంద్రంలో 11 మార్చ్ ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ (NTR చౌరస్తా) ధర్నా నిర్వహించాలని ఎస్ కే యం నిర్ణయించింది.. ఈ ధర్నాని విజయవంతం చేయాలని జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.. అదేవిధంగా రాష్ట్ర రాజధాని కేంద్రంలో 13 మార్చ్ రోజున ధర్మాన్ని విజయవంతం చేయాలని కూడా జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.. నిజాంబాద్ పసుపు మార్కెట్లో పసుపు కొనుగోలు వ్యాపారులు సిండికేట్ అవతారం ఎత్తి పసుపు క్వింటాలకు 2000 నుంచి 3000 రూపాయలు ధరను కృత్రిమంగా తగ్గిస్తున్నారని,,, వీరితోపాటు ఎర్రజొన్న వ్యాపారులు 40 మంది సిండికేట్ అవతారమెత్తి ఉత్తరాదిన డిమాండ్ ఉండంగా కూడా కృత్రిమంగా ధర తగ్గించిన వ్యాపారులపై చర్య తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసిందని తెలిపారు.

సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు. కంజర భూమయ్య.. అఖిలభారత రైతు కులి సంఘం రాష్ట్ర నాయకులు భాస్కర్.. జిల్లా నాయకులు. సాయి రెడ్డి.. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. P. రామకృష్ణ. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ముంబై గంగారం. తదితరులు పాల్గొన్నారు..

ఉద్యమ అభినందనలతో…

అడికే.రాజేశ్వర్. తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు..SKM జిల్లా నాయకులు…

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post