నిజామాబాద్ జిల్లా, సాలుర మండలంలోని ప్రజ్ఞ శ్రీ పాఠశాలలో ప్రిన్సిపాల్ లతా రాజు గారి ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను, వారి శాస్త్రీయ నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ లతా రాజు మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు. పిల్లల్లోని ఆవిష్కరణ శక్తిని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం” అని పేర్కొన్నారు.
సైన్స్ ఫెయిర్లో అనేక మంది విద్యార్థులు తమ తెలివితేటలను ఉపయోగించి వినూత్న ప్రయోగాలను ప్రదర్శించారు. వీరికి సాలూర మండల మహిళల ఎంఈఓ మేడం, బోధన్ ట్రస్మా అడ్వాన్స్ ప్రెసిడెంట్ హరి, విజేత కళాశాల డైరెక్టర్, బోధన్ డివిజన్ సెక్రెటరీ హరిసార్ (మాధవి హై స్కూల్, ఎడపల్లి) తదితరులు హాజరై, విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.
కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు, పాత్రికేయ మిత్రులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ లతా రాజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు కొత్తగా నేర్చుకునే అవకాశాన్ని అందించి, భవిష్యత్ శాస్త్రవేత్తల తయారీకి వేదికగా నిలిచింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








