Post Views: 41
నసురుల్లాబాద్ ప్రతినిధి:
బాన్సువాడ: జనవరి 31 (V1 న్యూస్) నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో గ్రామానికి చెందిన పట్లోళ్ల మోహన్ రెడ్డి నిర్మాణం చేపట్టిన సాయిబాబా ఆలయాన్ని శుక్రవారం రోజు అమెరికా బృందం సభ్యులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రత్యేక పూజలు, అభిషేకా లను తిలకించారు. అనంతరం ఆలయ వేద పండితులు వారికి శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి, విట్టల్ రెడ్డి, డిఎస్ఆర్ రాజు, అనుపాల్ రెడ్డి, విజయ్ కుమార్ (నందు)రెడ్డి, తదితరు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..