మానవ హక్కుల వేదిక రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం గంగూలు, రమేష్ కు కోరారు. బోధన్ పట్టణంలోని పి ఆర్ టి యూ భవన్ లో హెచ్ ఆర్ ఎఫ్ 10 వ రాష్ర్ట మహాసభల కర పత్రాలను సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీలలో అనంతపురం జిల్లాలో మహా సభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలలో కులగణన ఎందుకు అవసరం, బస్తర్ మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎన్ ఈ పి 2020 – కషాయికరణ, కార్పొరేటికరణ అనే అంశాలపై సదస్సులో వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అహ్మద్, నాయకులు ధర్మయ్య, మారుతి, అరుణ్ కుమార్, పిట్ల లక్ష్మి, విశ్రాంత ఎం ఈ వో కందారే శంకర్, హుసాన్ తదితరులు ఉన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....