రామగుండం నగరపాలకంలో ఆస్తి పన్ను మొండి బకాయలు వసూలు///
24,81, 668 /- ల ఆస్తి పన్ను అధికారులు వసూలు///
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 21:-
రామగుండం నగర పాలక సంస్థ ఆస్తి పన్ను మొండి బకాయలు వసూలు చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో , రామగుండం మండల తహశీల్దార్ అధికారులు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించడానికి చర్యలు తీసుకోవడంతో ఒక్కటొక్కటిగా వసూలవుతున్నాయి. ఇంటి నెంబర్ 22-8- 115కు సంబందించి రామగుండం నగర పాలక సంస్థకు బకాయపడిన ఆస్తి పన్ను రూ 24,81, 668 /- లు గురువారం వసూలయింది. మాతంగి కాలనీ లోని సదరు ఆస్తికి సంబందించిన పన్ను బకాయలను యాజమానుల తరపున హర్ష, వెంకటేశం, నూరుల్ హుస్సేన్ లు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు , కమిషనర్ ఎఫ్ ఎ సి అరుణ శ్రీ కి స్వయంగా చెక్కు రూపంలో అందించారు. రామగుండం నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ రెవెన్యూ ఆంజనేయులు , రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు శంకర్ రావు , కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM