Post Views: 46
V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బహిరంగ మలవిసర్జనకు ప్రజలందరూ చరమ గీతం పాడాలని.. ప్రతి ఒక్కరూ ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆరు బయట మలవిసర్జన చేయడం వలన దోమల ద్వారా రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయని ఎల్లారెడ్డి డిఎల్ పి ఓ సురేందర్ తెలిపారు. మంగళవారం రోజు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని తిమ్మారెడ్డి తండాలో ఓ ఇంటి వద్ద ప్రతినిత్యం వినియోగించే శుభ్రంగా ఉన్నటువంటి మరుగుదొడ్డిని ఎంపీడీవో ప్రకాష్ తో కలిసి పరిశీలించారు. బహిరంగ మల విసర్జనను నిర్మూలించడానికి ప్రజలందరూ నడుం బిగించాలని ఆకాంక్షించారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..