Post Views: 56
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి మండలంలోని హెచ్ డబ్ల్యూ సి క్యాసం పల్లి ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజు ప్రజలకు యాంటీబయాటిక్స్ అతిగా వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైద్య సిబ్బంది ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి బయాటిక్స్ మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలని.. ఎక్కువగా వినియోగించడం వల్ల ఆ మందులు పనిచేయవని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి, ఆశ ,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..