12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన అంతర్గాం మండలం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్ ///
లంచం కోసమే విధులు నిర్వహిస్తున్న అంతర్గం రెవెన్యూ అధికారులు ///
చిన్న చితిక అనే తేడా ఏం లేదు పైసా ఫేక్ తమాషా దెక్ ///
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి జిల్లా/ అంతర్గం మండలం:-
అంతర్గం మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ అధికారులు మంగళవారం ఏసీబీ తనిఖీలో పట్టుబడ్డారు. అయితే 12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన అంతర్గాం మండలం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్. సీజ్ అయిన ఇసుక ట్రాక్టర్ ను రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారులు. ఇదివరకే రిలీజ్ కోసం ఫైన్ పైసలు కట్టినప్పటికీ ఎమ్మార్వో ఆర్ ఐ లు కలిసి బాధితుని వద్ద డబ్బులు డిమాండ్ చేశారని డబ్బులు ఇస్తేనే ట్రాక్టర్ రిలీజ్ చేస్తామని బెదిరింపుల గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు అయితే ఈ మేరకు ఏసీబీ అధికారులను సంప్రదించగా వారు మంగళవారం సడన్ ఎంట్రీ ఇవ్వడంతో అధికారులు కొంగు తిన్నారు. ఈ దాడిలో ఒక అధికారి దొరకగా మరొక అధికారి పరారీలో ఉన్నారని విశ్వసనీయమైన సమాచారం. ఎమ్మార్వో కార్యాలయంలో విచారణ చేస్తున్న ఏసీబీ డీఎస్ఫీ వి వి రమణమూర్తి. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్య తీసుకుంటామని ఏసిబి అధికారం తెలిపారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM