Post Views: 58
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం సోమేశ్వర్, దుర్కి గ్రామాల శివారులో గత కొన్ని రోజులుగా మొరం మాఫియా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలను జరుపుతున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సోమవారం రోజు బాన్సువాడ తహసిల్దార్ వరప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వారిపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ క్రమంలో వారు అక్రమంగా మొరం తరలిస్తున్న ఐదు టిప్పర్లను, ఒక జెసిబి వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..