Post Views: 64
V1 న్యూస్ పిట్లం ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండలం రాంపూర్ (కలాన్) గ్రామంలో సోమవారం రోజు పశువులకు ఉచితంగా గర్భకోశ వ్యాధుల నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. పశుగణాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ మజీద్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో మొత్తం 83 పశువులకు ఉచితంగా మందులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సంతోష్ కుమార్, గోపాలమిత్ర సంగమేశ్వర్, అంజని కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..