Post Views: 55
V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: మోస్రా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం రోజు ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెద్ది గారి శోభన్ (40) తన పొలంలో నారుమడికి నీరు పెట్టడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోకల రమేష్ తెలిపారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..