రామగుండం మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అబివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయాలని///
పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ఎఫ్ ఎ సి అరుణ శ్రీ.
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 11:-
రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అబివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ఎఫ్ ఎ సి అరుణ శ్రీ ఇంజనీరింగ్ అధికారులను,కాంట్రాక్టర్ లను ఆదేశించారు. సోమవారం ఉదయo రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్ లలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. మార్కండేయ కాలనీలో పెద్ద కాలువ నిర్మాణ పనులు , దుర్గా నగర్ లో పూర్తయిన సి సి రోడ్డు పనులు , ప్యాచ్ వర్కులు , గౌతమి నగర్ నుండి ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్స్ వరకు జరుగుతున్న మీడియన్ నిర్మాణ పనులు , ఖాజీపల్లి లో భూ గర్భ మురుగునీటి కాలువ నిర్మాణ పనులు, సప్తగిరి కాలనీలో పూర్తయిన సి సి రోడ్డు ను పరిశీలించారు . రాజీవ్ రహదారి వెంబడి వైద్య కళాశాల సమీపంలో ఎన్ పి డి సి ఎల్ సంస్థ వేసిన విద్యుత్ స్థంబం కారణంగా ఏర్పడిన నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీ ని పరిశీలించారు. ఈ సంధర్భంగా నగర పాలక సంస్థ ఇ ఇ రామన్ , డి ఇ జమీల్ అహ్మద్ , ఎ ఇ షోయమ్ మీర్ తదితరులు ఉన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM