V1News Telangana

నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ……. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ….. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం, నవంబర్ -01:

ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ అన్నారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ రామగుండంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వేకు సంబంధించి శిక్షణ, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మాట్లాడుతూ, ప్రతి ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన ఎన్యుమరేషన్ బ్లాక్ పరిధిలో సర్వే సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, సర్వే షెడ్యూల్ ప్రజలకు ముందస్తుగా అందజేయాలని, సర్వే సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ధరణి పాస్ పుస్తకాలు అందుబాటులో ఉంచుకునేలా ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో రామగుండం మున్సిపల్ కమిషనర్, రామగుండం తహసిల్దార్ కుమారస్వామి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post