V1News Telangana

వికలాంగులకు చేయూత అందించడానికి ట్రై సైకిల్ మరియు కృత్రిమ పాదాలు పంపిణీ చేయడానికి ఎంపిక శిబిరం ఏర్పాటు……

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో గల శ్రీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో శ్రీమతి & శ్రీ పట్లోళ్ల శైలజ-మోహన్ రెడ్డి (USA ) వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఖమ్మం వారి సంయుక్త సహకారంతో తేదీ 22 అక్టోబర్, మంగళవారం రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వికలాంగులకు ట్రై సైకిల్ లు మరియు ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ కాళ్లు పంపిణీ చేయడానికి ఎంపిక శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వికలాంగులు మరియు ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన బాధితులు ఎంపిక శిబిరంలో పాల్గొని లబ్ధి పొందాలని తెలియజేస్తున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post