వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని తాహసిల్దార్ కు వినతి.
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాలురా మండల వీఆర్ఏలు గురువారం సాలురా తాహసిల్దార్ శశిభూషన్ కు వినతీ పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 61 సంవత్సరాలుపై బడిన వీఆర్ఏల వారసులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 81,85 ప్రకారం ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలను ఇచ్చేవిదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు.ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.కారుణ్య నియామాకాలను సత్వరమే చేపట్టి అదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక సమస్యలతో విఆర్ఏలు జీవన శైలిలో అనేక ఇబ్బందులను ఎదురుకుంటున్న సందర్భలు ప్రభుత్వానికి తెలుసని గుర్తు చేశారు.తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు దేవేందర్,ఫయాజ్,లక్ష్మణ్,రాజేష్,శంకర్,మొయినుద్దీన్,నాగయ్య,కిషన్,గంగారం తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....