Post Views: 34
V1న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో మంగళవారం రోజు “సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్”స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలకు బ్యాంకుల్లో అందించే సేవలు, సైబర్ నేరాలు, ఏటీఎం ఉపయోగాలు, డిజిటల్ పేమెంట్స్, బీమా పథకాలు, సుకన్య సమృద్ధి యోజన పథకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, బాలకృష్ణ, పర్వయ్య, అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..