Post Views: 87
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమలి గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో ప్రతిష్టించిన గణనాధున్ని తొమ్మిదవ రోజు అయిన ఆదివారం రోజు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో గల వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామంలో గల చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బాలరాజ్, పోతా రెడ్డి, రామిరెడ్డి, నాగరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








