V1News Telangana

పేకాట ఆడేదెట్లా..?మహారాష్ట్రలో క్లబ్ల మూసివేత . అడ్డాల కోసం వెతుకులాటలో నిర్వాహకులు . హైదరాబాద్లో క్లబ్లు ప్రారంభమౌతాయని అభయం .లీకేజిలపై పోలీసు శాఖలో ఆందోళన వెల్లడయింది. నిజామాబాద్ నగరంలోని ఒక త్రిస్టార్

పేకాట ఆడేదెట్లా..?మహారాష్ట్రలో క్లబ్ల మూసివేత . అడ్డాల కోసం వెతుకులాటలో నిర్వాహకులు . హైదరాబాద్లో క్లబ్లు ప్రారంభమౌతా

నజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పేకాటరాయుళ్ళపై ఇటీవల కాలంలో పోలీసు, టాస్క్ ఫోర్స్ దాడులు పెరిగాయి. ఎక్కడైనా పేకాట ఆడుదామంటే వారం పది రోజులకే పట్టుబడడం రివాజుగా మారింది.

ఎక్కడో ఒక చోట పేకాట స్థావరాలపై దాడులు అన్నవి నిత్యం జరిగే తంతుగా మారాయి. ఈ నెల రెండవ వారంలో నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ ను పేకాట క్లబ్ గా మార్చిన వ్యవహరాన్ని ఇటీవల ఎస్సైల బదిలీల్లో భాగంగా అక్కడికి బదిలీల్లో వచ్చిన కొత్త ఎస్పై బట్టబయలు చేశారు. పేకాట క్లబ్ లను తలదన్నే విధంగా సకల సౌకర్యాలను, టేబుళ్ళను ఏర్పాటు చేసి కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లికి చెందిన నిర్వాహకుడు పేకాటను ఏడాదిన్నర కాలంగా నిర్వహిస్తున్న విషయం బహర్గతమైంది. స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి అండతో క్లబ్ మాదిరిగా గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన కొత్త గవర్నమెంట్ లో అది కొనసాగింది. జిల్లా నలుమూలల నుంచి కాకుండా జగిత్యాల్, కోరుట్ల, రాజన్నసిరిసిల్లా జిల్లాల నుంచి కూడా అక్కడ జూదగాళ్ళు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు.

తాజాగా అక్కడ పేకాట స్థావరంపై పోలీసుల దాడితో ఈ వ్యవహరం బట్టబయలు అయింది. కానీ గతంలో ఉన్న పోలీసు అధికారులకు మామూళ్ళను ఇచ్చి పేకాట క్లబ్ ను నిర్వహించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయంలో విచ్చలవిడిగా జరిగిన పేకాట స్థావరాలపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ దాడులు పెరిగాయి. గతంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండతో పేకాట రాయుడు బహిరంగంగానే రెచ్చిపోయారని ప్రజాప్రతినిది భర హెదరాబాద్ రోడులో పేకాట

NEE&WS మండలానికి చెందిన మాజీ

హెూటల్ లో వినాయక్ నగర్ కు చెందిన బిల్డర్లు పేకాట క్లబ్ గా మార్చిన విషయం తెల్సిందే. నిత్యం 20 వేల ఆదాయం ఉండడంతో సదరు హెూటల్ నిర్వాహకుడు కూడా వారికి గదులను అద్దెకు ఇచ్చి సకల ఏర్పాట్లను చేశారు. టాస్క్ ఫోర్స్ లో పని చేసిన సీఐలకు మామూళ్ళు వెళ్లడంతో ఆ దందా కూడా నిరాటకంగా సాగింది. గత కొన్ని రోజుల క్రితం పోలీసుల రైడ్ లతో పేకాట మూతపడిన విషయం తెల్సిందే. నిజామాబాద్ లో పేకాట ఆడలేమని తెలిసి కొందరు నిర్మల్ జిల్లా అప్పారావుపేట్ కు, నాందేడ్ జిల్లా బిలోలి, దెగ్లూర్ లోని క్లబ్ లకు తరలివెల్లే వారు. అక్కడ పేకాట ఆడడానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడం, నిర్వాహకులు వారికి వాహన ఏర్పాట్లతో పాటు మద్యం, విందు ఏర్పాట్లు చేయడంతో పేకాట ఆట నిరాటకంగా సాగింది. నిజామాబాద్ కు చెందిన మాజీ కానిస్టేబుళే మరికొంత మందితో కలిసి పేకాటను నిర్వహించడంతో జిల్లా నుంచి ప్రతినిత్యం వందల మంది పేకాట ఆడేందుకు వెళ్లేవారు. ఇటీవల అక్కడ అడ్డాలను మూసివేశారు. పోలీసు శాఖ కూడా ఉక్కుపాదం మోపడంతో పత్తాలాట బంద్ అయింది. తాజాగా ఉద్ గిర్ లోని కమలాపూర్ లో కొత్త పేకాట ఆడిస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ నుంచి 170 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి పేకాటరాయుళ్ళు వెళ్లడం

రిస్క్ గా భావిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో పేకాట ఆడిస్తున్న విషయం లీక్ అయింది. దాంతో పోలీసులు అప్రమత్తం చేయడంతో పేకాట రాయుళ్ళు గుట్టుచప్పుడు కాకుండానే నిష్క్రమించారు. ఇప్పుడు పేకాట ఆడేందుకు అడ్డాలు లేక తహతహలాడుతున్నారు. తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడడం, గత ప్రభుత్వంలో నిషేదానికి గురైన క్లబ్ లు మళ్ళీ తెరుస్తారని.

పోలీసులు పేకాట గ్రామీణ

శివారు ప్రాంతాల్లో జోరుగా నిర్వహించినట్లు

ప్రాంతాలకు షిఫ్ట్ అవుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post