V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: శ్రావణమాసం సందర్భంగా నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా మందిరంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల సమయం నుండి ఆలయ కమిటీ పురోహితులు, సభ్యులు సాయినాధుడికి అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలతో ఆర్జిత సేవలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాదం స్వీకరించారు. సాయంత్రం పూట భక్తులు భక్తిశ్రద్ధలతో, భజన సంకీర్తనలతో బాబాకు పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేనేజర్ పోతారెడ్డి, సూపర్ వైజర్ బాలరాజ్, నాగరాజు, వివిధ గ్రామాల భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..