రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడండి
అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం
ఆస్పత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తెండి
మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తాం
బదిలీలు ఉన్నందున, ఓవర్ టైమ్ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించండ
బోధన్
బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యాలు ‘ సిబ్బంది ఎప్పటికప్పుడు చూడాలని, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు, బోధన్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు, అంతేకాకుండా రోగుల వద్దకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని అన్నారు. హాస్పిటల్ లో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు, సిబ్బంది బదిలీలు ఉన్నందున, కొంచెం సమయం అయినప్పటికీ , ఇబ్బంది పడకుండా ఓవర్ టైం డ్యూటీ చేసి రోగుల కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పిస్తామని ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన అన్నారు అంతే కాకుండా మంచినీటి సౌకర్యం మెరుగుపరుస్తామని అన్నారు .ఈ సందర్భంగా రోగులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి తమకు మెరుగైన వైద్యం అందుతా లేదని తమకు న్యాయం చేయాలని, అన్ని వ్యాధులకు ఒకే మందు ఇస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు.
Error: Contact form not found.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....