రైస్ మిల్ నిర్వాహకులు ఇష్టారాజ్యం
13వ వార్డు కాలనీ ప్రజల పాలిట శాపం..
రోడ్డు ధ్వంసం అవుతున్నాయి బురదమయం అవుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కారణం రై
బోధన్
అధికారులకు పాలకులకు మామూలు ఇస్తున్నాం
వారంతా మా గుప్పిట్లో ఉన్నారు మీరు ఎలాంటి ఆందోళన చేసినా మాకు ఏమీ కాదు అంటున్నారు అంటూ బోధన్ పట్టణం చెందిన 13 వ వార్డు కాలనీ ప్రజలు రోడ్డుపై ధర్నా చేశారు,
ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ కాలనీలో చాలా రైస్ మిల్లు ఉన్నాయని, రైస్ మిల్లకు లారీలు వస్తూపోతూ ఉంటాయని, ఈ లారీల రాకపోకల వల్ల, రోడ్లు ధ్వంసం అవుతున్నాయి అని అన్నారు, రోడ్డు గుంతల మయంగా మారి వర్షపు నీరు చేరి బురదమయంగా మారి రాకపోకలకు అంతరం ఏర్పడుతుందని అన్నారు, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రైస్మిల్ల నిర్వాహకులకు చెబితే ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. పాలకులకు అధికారులకు మామూలు ఇస్తున్నామని వారంతా మా గుప్పిట్లో ఉన్నారని మీరు ఎలాంటి ఆందోళన చేసిన వినతి పత్రాలు ఇచ్చిన ఎవ్వరికి చెప్పినా మాకు ఏమీ కాదని అంటున్నారు అని అన్నారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలంటూ కాలనీవాసులు వాపోతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....