Post Views: 249
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా ఇసుక దందా ఆగడం లేదు. క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుపోయిన మాఫియా.. దర్జాగా దౌర్జన్యానికి పాల్పడుతోంది..
.నిజామాబాద్ జిల్లా అటు సాలురా,ఇటు బోధన్ మండలాల్లోని మంజీరా నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.అధికారులు ఇసుకాసురులపై కఠిన చర్యలు తీసుకోక పోవడంతో రెచ్చిపోతున్నారు. అక్రమ రవాణాతో జేబులు నింపుకొంటూ అడ్డచ్చినవారిపై దాడులకు పాల్పడుతున్నారు. నిత్యం ట్రాక్టర్లలో,టిప్పర్లలో టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది. పోలీసు, రెవెన్యూ అధికారుల ఉదాసీనతకు తోడు స్థానిక నాయకుల అండతో దందా కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








