….బోధన్ మండల కేంద్రంలోని బెల్లాల్ శివారు ప్రాంతంలో అసైన్మెంట్ ల్యాండ్ లో ఆదివారం నాడు అక్రమ త్రవ్వకాలు జరుపుతున్నారు. గత కొద్దిరోజుల నుండి ఈ మొఱ్ఱం త్రవ్వకాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు సైతం దాన్ని అడ్డుకున్నారని స్థానిక ప్రజలు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు వాటికి పరిమిషన్ ఇచ్చినట్లు వాళ్ళు చెబుతున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. చెరువులో లెవెల్ చేస్తామని చెప్పినా మాఫియా రాయులు 30 నుండి 40 ఫీట్ల లోతుకు మొఱ్ఱం త్రవ్వకాలు చేస్తూ ఇష్టానుసారం దో నెంబర్ దందా దర్జాగా వేహాబిల్ రూపంలో కొనసాగిస్తున్నారు అయ్యా రెవెన్యూ అధికారులారా కొంచెం ఆలోచించండి అసైన్మెంట్ ల్యాండ్ అది ఆ ల్యాండ్లో ఎటువంటి తవ్వకాలు చేయడం రాదు ఆ ల్యాండ్ అనేది వాళ్లకు చేసుకుని తినడానికి ఇచ్చింది అప్పట్లో ప్రభుత్వం.
మరి అదే ల్యాండ్ ను వాళ్ళు మాఫియా రాయులకు లీజుకు ఇచ్చి దాంట్లో 50 ఫీట్ల లోతుకు తవ్వేసి అమ్మకాలు చేస్తూ లక్షల్లో డబ్బు సంపాదన చేస్తున్నారు. మరి మీరు ఎందుకు ఆ ల్యాండ్ పైన త్రవ్వకాలకు పర్మిషన్ ఇస్తున్నారు అర్థం కావట్లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరియు రేవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బోధన్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మూఱ్ఱం త్రవ్వకాలను బోధన్ తాసిల్దార్ గారు ఆపేయాలని,లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని బోధన్ 9వ వార్డులోని కొందరు స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....