Post Views: 39
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన పిడిఎస్ బియ్యాన్ని ఖచ్చితమైన సమాచారం మేరకు శుక్రవారం రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ఇంట్లో దాడులు చేసి 22 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో తన సొంత నివాసంలో షేక్ అర్బాజ్ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. షేక్ అర్బాజ్ పై పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..