Post Views: 35
V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. గొప్ప విద్యావేత్త సామాజిక సేవ తత్పరం కలిగిన వ్యక్తిగా ఆయన సమాజంలో మంచి గుర్తింపు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సౌమ్య, సావిత్రి, శ్యామ్, దేవి సింగ్, సుభాష్, నారా గౌడ్, బాలకిషన్, రాకేష్, సతీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..