V1న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం రోజు స్థానిక జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ఎంపీపీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డి లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కళాశాలలో విద్యార్థులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతమంది అడ్మిషన్లు తీసుకున్నారన్న విషయంపై అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 42 మంది విద్యార్థులు అడ్మిషన్ అయ్యారని ఉపాధ్యాయులు వారికి తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం వలన మండలంలోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..