Post Views: 33
-ఏపీఎం గంగాధర్
V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో ని వైకిపీ కార్యాలయంలో బుధవారం రోజు VOA లు మరియు CC లతో ఐకెపి ఎపిఎం గంగాధర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో డ్వాక్రా మహిళా సంఘాలలో చీరని మహిళలను కొత్తగా సంఘాలు ఏర్పాటు చేయించాలని తెలిపారు.. మరియు దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేసి, ఈ సంవత్సరం బ్యాంకు లింకేజీ ద్వారా 22.50 కోట్ల రుణాలు లక్ష్యంగా మహిళలకు ఇప్పించాలన్నారు. అదేవిధంగా బ్యాంకు లింకేజీ మరియు శ్రీనిధి రికవరీ 100% ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ క్రాంతి మరియు SN మేనేజర్ మహేందర్,CC లు,VOA లు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..