Post Views: 35
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి దారి ఏర్పాటు చేయడానికి నిర్మాణ పనులను సోమవారం రోజు గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలువురు దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారాయణరెడ్డి, మంత్రి గణేష్, ఉద్దెర హన్మండ్లు, నాగులూరి శ్రీనివాస్, మునిగెల చంద్రశేఖర్, శివకుమార్, వెంకటేష్, రమేష్, సాయిలు,ఇబ్రహీం, లింగం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..