Post Views: 31
కామారెడ్డి జిల్లా: బక్రీద్ పండుగను పురస్కరించుకొని సోమవారం రోజు కామారెడ్డి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్ల తో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అని అన్నారు. ఎదుటివారిపై కరుణ మరియు సహనంతో కూడిన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే పండగ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, నివాళులు అర్పిస్తూ జరుపుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..