నిజామాబాద్
తేది :- 16-6-2024
*బక్రీద్ పండగ నేపద్యంలో ట్రాఫిక్ మళ్లింపు: పోలీస్ కమీషనర్ వెల్లడి
ఇందుమూలంగా నిజామాబాద్ నగర ప్రజలకు తెలియజేయునది ఏమనగా తేది: 17-6-2024 రోజున బక్రీద్ పండుగ సందర్భంగా ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాలలో, ముస్లీం సోదరులు ప్రార్ధనలు చేస్తారు. కాబట్టి ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు ఈ క్రింది విధంగా చేయబడును.
1) *బోధన్ వైపు వెళ్లేవారు* :
ఆర్.టి.సి బస్ స్టాండ్ నుండి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శివాజీ చౌక్, గంజ్, నిజాం కాలని మీదుగా అర్సాపల్లి నుండి బోధన్ కు వెళ్లాలి.
2) *హైదరాబాద్ నుండి బోధన్ వైపు వెళ్లేవారు*:
మాదవనగర్ బై పాస్ నుండి కంఠేశ్వర్ బైపాస్, న్యూ కలెక్టరేటు ద్వారా అర్సావల్లి మీదుగా బోధనకు వెళ్లాలి.
3) *బోధన్ నుండి నిజామాబాద్ వచ్చేవారు*:
అర్సావల్లి సర్కిల్ నుండి న్యూ కలెక్టరేటు మీదుగా కంఠేశ్వర్ బైపాస్ , ఎన్.టి.ఆర్ సర్కిల్, ఆర్.టి.సి బస్ స్టాండ్కు రావాలి.
*కావున నగర ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి మాతో సహకరించగలరని ప్రార్ధన*.
*కల్మేశ్వర్ సింగెనవర్, IPS.,*
*కమీషనర్ ఆఫ్ పోలీస్*
*నిజామాబాద్*

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....