పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో భార్య, పిల్లలు..నా భర్త ఉద్యోగం నాకు ఇప్పించండి..
అప్పుడు ఇప్పుడు అంటూ మాట దాటేస్తున్న సంవత్సరాలు గడిపిన కార్మిక నేతలు పట్టించుకునే నాధుడే లేడు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 06:-
కరోనా కాటుకు బలైన భర్త. పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో భార్య, పిల్లలు… ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు.. ఎన్టీపీసీ యాజమాన్యం ఆదుకోవాలని అభాగ్యురాలి విన్నపం..మహమ్మారి కరోనా కాటుకు భర్తను కోల్పోయింది.. పెద్దదిక్కును కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కోడూరి స్వప్న .. తన భర్త ఎన్టీపీసీ లో ఉద్యోగం చేస్తూ చనిపోయాడని యాజమాన్యం ఆదుకోవాలంటూ అభాగ్యురాలు వేడుకుంటుంది. అయితే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్టిపిసి లో విధులు నిర్వహిస్తూ కరోనా కాటుకు ఒక కార్మికుడు బలయ్యాడు అయితే ఎన్టిపిసి ఒప్పందం ప్రకారం ఎన్టిపిసి విధుల్లో మరణిస్తే అతని ప్లేసులో కుటుంబ సభ్యులకు ఒకరికి చేర్చుకునే హక్కును ఎన్టిపిసి యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. అయితే దీంట్లో కొంతమంది కార్మిక నేతలు అప్పుడు ఇప్పుడు అంటూ మాట దాటేస్తూ సంవత్సరాలు గడిపారు. అయితే కోడూరు స్వప్న ఎన్ టి పి స సంబంధించిన కార్మిక నేతలకు పత్రాలు అందజేసినప్పటికీ వారు పట్టించుకోవడంలేదని పలుమార్లు కార్మిక నేతలకు కలిసిన కూడా న్యాయం జరగలేదని గోడు వెళ్ళబోసుకుంటుంది. ఇప్పటికైనా ఎన్టిపిసి యాజమాన్యం స్పందించి ఆ భాగ్యరాలిని విధుల్లో తీసుకొని వారి కుటుంబానికి సహాయం చేయాలని కోరుతుంది.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM