V1News Telangana

పెద్దపెల్లి ఎంపీ స్థానం కాంగ్రెస్ హస్తగతం, లక్షకు పైగా మెజారిటీతో భారీ విజయoతో గడ్డం వంశీకృష్ణ గెలుపు

పెద్దపెల్లి ఎంపీ స్థానం కాంగ్రెస్ హస్తగతం, లక్షకు పైగా మెజారిటీతో భారీ విజయoతో గడ్డం వంశీకృష్ణ గెలుపు

లక్షకు పైగా మెజారిటీతో గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం – రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్

వంశీకృష్ణ గెలుపును ప్రకటించడంతో ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గడ్డం వివేక్, విజయరమణ విజయనాధంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 04:-

 గోదావరిఖని :- ఈ నెల 13వ తారీకున జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో భాగంగా పెద్ద పెల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి దివంగత రాజకీయ నాయకులు క్రీస్తు శేషులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం ప్రకటించిన ఎన్నికల డిక్లరేషన్ లో లక్ష ఓట్లకు పైగా సుమారుగా లక్ష మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేయడం జరిగినది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ నుండే కాకుండా మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ధర్మపురి, మంథని, పెద్దపెల్లి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేసినటువంటి సందర్భంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి ఇటు సింగరేణి కార్మికులు అటు ఎన్టిపిసి కార్మికులు కార్మిక క్షేత్రంలో ఉన్న కార్మికులందరూ అలాగే నియోజకవర్గంలో ఉన్న కర్షకులు వ్యాపారస్తులు విద్యార్థులు రైతులు ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లే ఇవాళ ముందస్తుగా అనుకున్న విధంగానే లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రకటించిన సందర్భంలో ఇవ్వాలా లక్షకు పైగా సుమారుగా 1,31364 పైచిలుకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు గడ్డం వంశీకృష్ణని రికార్డు స్థాయి భారీ మెజారిటీతో గెలిపించుకున్నామని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ రామగుండం నియోజకవర్గం ప్రజలతో పాటు పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అలాగే మా మీద మరింత బాధ్యత పెరిగినదని రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటు పడతామని జోడేడ్ల బండిల పని చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగినది. అనంతరం గెలుపు విజయాన్ని ప్రకటించగానే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారితో పాటు మాన్యశ్రీ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ భారీ విజయంతో పెద్దపెల్లి ఎంపీగా గెలిచిన వంశీకృష్ణని అభినందిస్తూ విజయ నాదంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య గెలుపు ఉత్సవాలను జరుపుకోవడం జరిగినది. అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్ద పెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ విజయంతో గెలిచినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా విజయోత్సవాలు జరుపుకుంటు టపాకాయలు పేలుస్తూ స్వీట్ పంపిణీ చేసుకుంటూ ఒకరినొకరు అభినందించుకోవడం. జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post