బాన్స్వాడ నియోజకవర్గం లో 11వేల డబల్ బెడఁరూం లు ఇచ్చారంటున్నారు మరి దాంట్లో ఎంత మంది అర్హులైన వారున్నరు పేదలకు దక్కల్సిన డబల్ బెడఁరూం లను డబ్బులకు ఆశ పడి పేద ప్రజల భవిషత్తును నాయకులు అమ్ముకున్నారని బాన్స్వాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ మండిపడ్డారు. రుద్రూర్ మండల కేంద్రం లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో ఇందూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో ఇచ్చిన డబల్ బెడఁరూం లో నాయకులు అవినీతికి పాల్పడినట్టు అయన బహిరంగంగా చెపారు. అవినీతి జరిగిన మాట నిజమని నిర్పించడానికి తను గుడి ఎక్కడానికి సిద్దామని మరి ఆ నాయకులు సిద్ధంగా ఉన్నారా అని ఇందూర్ చంద్రశేఖర్ సవాల్ విసిరారు. అవినీతి జరిగితే అధికారులు వాటి పై చర్యలు తీసుకుంటారా అనేది కోటి రూపాయల ప్రశ్న. ఎంపీ ఎన్నికల తరువాత పేద ప్రజలకు అర్హులైన వారికి డ్రా తీసి వారికి ఇస్తామని ఇందూర్ చంద్రశేఖర్ అన్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist