Post Views: 34
నసురుల్లాబాద్ మండలం: గత వారం రోజుల క్రితం V1 న్యూస్ పత్రికలో ప్రచురితమైన “*ప్రమాదాలు సంభవిస్తే గాని మరమ్మతులకు నోచుకోని రోడ్డు మార్గాలు*” అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ప్రయాణ ప్రాంగణం సమీపంలో ప్రధాన రహదారి గుంతలమయం అవ్వడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని , ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని V1న్యూస్ లో కథనం ప్రచురితమయింది. ఈ కథనానికి
జాతీయ రహదారుల AE శ్రీధర్ స్పందించి శనివారం రోజు తారు వేయించి గుంతలను పూడ్చి వేయించాడు . ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు V1 న్యూస్ పత్రిక యాజమాన్యానికి ,AE శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..