బుధువారం రాత్రి 11 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలు వచ్చాయి.ఇంటర్మీడియట్ ఫలితలో ఈ సారి కూడా మహిళా ల దే పై చేయి .అయితే నిజామాబాదు జిల్లా లో ఇంటర్మీడియట్ లో మొదటి ర్యాంక్ రుద్రూర్ గ్రామానికి చెందిన చిక్కెలా పూజిత సాధించింది. 470/467 మార్కులతో నిజామాబాదు జిల్లాలో మొదటి ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ చిక్కెలా పూజిత సాధించింది.రుద్రూర్ గ్రామం లో నివసించే చిక్కెలా మొఘలయ్య కూతురు చిక్కెలా పూజిత పేద కుటుంబం రేకడేదాకా డొక్కాడనీ పరిస్థితి అ లాంటి కుటుంబం లో జన్మించి కష్టలను అనుభవించిన పేదరికం తన లక్ష్యానికి ఎదురచ్చిన భయపడకుండా తన లక్ష్యం వైపే ప్రయాణం కొనసాగించిన పూజిత ను రుద్రూర్ మండల ప్రజలు అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు నిజాంబాద్ జిల్లాలో రుద్రూర్ గ్రామనికి పేరు తీసుకొచ్చిన పూజితను మండల ప్రజలు అభినందిస్తున్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist