కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి సందర్భంగా బుధవారం రోజు తెల్లవారుజామున గ్రామస్తులంతా ఐక్యమత్యంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రథోత్సవం గ్రామంలోని పలు వీధుల వెంట రామనామ స్మరణలతో, ఆంజనేయస్వామి భక్తి గీతాలు ఆలపిస్తూ, భజన కార్యక్రమాలతో తమ భక్తిని చాటుకున్నారు. బుధవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగా గ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహించనున్నామని గ్రామస్తులు తెలిపారు. చివరి కుస్తీ విజేతకు రూ .5001 గా నిర్ణయించారు. ఈ పోటీలకు పోరుగు గ్రామాల నుండి మరియు కర్ణాటక ,మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో మహిళ మల్లయోధులు రానున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటరమణ, మాజీ ఎంపీపీ భువనేకర్ జ్యోతి ప్రకాష్ ,మాజీ సర్పంచులు శ్రావణ్ కుమార్, సాయాగౌడ్ లతోపాటు గ్రామ పెద్దలు కోటి ,ఫారెస్ట్ బాలయ్య, అయ్యేలా ఆనంద్ కుమార్, గాండ్ల హ్యన్మాండ్లు, గాండ్ల సాయిలు ,విటల్ గౌడ్ గ్రామ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....