Post Views: 60
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో నీటి ఎద్దడి సమస్య ఉందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో నీటి నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో సింటెక్స్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంపీవో రాము గారి ఆధ్వర్యంలో జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు. వేసవికాలం ప్రారంభం అవడంతో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి వాటి పరిష్కారానికి మరో 47 సింటెక్స్ ట్యాంకులను ఆర్డర్ పెట్టామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాచుపల్లి పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








