*మాజీ జెడ్పిటిసి సభ్యుడికి మాతృవియోగం.
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ మాతృమూర్తి కస్తూరి శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయస్సు 107 సంవత్సరాలు ఉంటుందని తెలియజేశారు. ఆమెకు సంతానం నలుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మల్లాపూర్ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి , ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు సతీష్ ను వారి కుటుంబ సభ్యులను ను పరామర్శించారు. ఆదివారం రోజు అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలియజేశారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..